Hema Malini | డ్రీమ్ గర్ల్ హేమామాలిని ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నది. తన కుటుంబ సభ్యులతో సంతోషంగా సంక్రాంతిని ఎంజాయ్ చేస్తూ పొంగల్ వండింది. తను పొంగల్ వండిన ఫోటోలను ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతి పండుగ అంటేనే పొంగల్. చాలామంది పొంగల్ వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ దాన్ని తిని సంతోషంగా గడుపుతారు. హేమా మాలిని పొంగల్ వండిన తర్వాత తన కూతురు ఈషా డియోల్ కూడా పొంగల్ చేసి.. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దేశమంతా సంక్రాంతి సంబురాలు చేసుకుంటోంది. మా ఇంట్లో నేను ఎప్పుడూ పొంగల్ చేస్తూ ఉంటాను. నా పిల్లలకు కూడా అది ఫేవరేట్ ఫుడ్. పొల్గాలో పొంగల్ అంటూ అందరం దాన్ని తింటాం.. అంటూ ఈషా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ఇక.. హేమమాలిని సినిమాల విషయానికి వస్తే.. తను 2020లో చివరగా షిమ్లా మిర్చి సినిమాలో కనిపించింది. ఈషా డియోల్ మాత్రం 2021లో ఏక్ దువా సినిమాలో నటించింది.