హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య ప్రస్తావించడంతో అటు సినీ రాజకీయవర్గాలు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రకాశ్రాజ్, నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వంటి చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు మంత్రి సురేఖ తీరును ఎండగడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఆధారేల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
‘కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్రి పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊర్కునేదిలేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతదేశంలో నిర్లక్ష్య ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024