హీరో రామ్లోని ఎనర్జీని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ‘ఇస్మార్ట్శంకర్’. దర్శకుడు పూరీజగన్నాథ్ ఈ సినిమాతో రామ్లోని ఆప్డేట్ వెర్షన్ని ఆవిష్కరించాడు. హైవోల్టేజ్ పవర్ఫుల్ ఎనర్జీతో కూడిన ఈ కేరక్టరైజేషన్లో హీరో రామ్ చెలరేగిపోయి నటించాడు. హీరోలకు అభిమానులు ఉన్నట్టుగా ఆ కేరక్టరైజేషన్కి ఫ్యాన్సున్నారు. అందుకే.. ఆ పాత్రకు మరింత పవర్ని మిక్స్ చేసి రామ్తోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు పూరీ. ఈ సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే విడుదల తేదీని కూడా ప్రకటించారు.
ఈ ఏడాది మార్చి 8న సినిమాను విడుదల చేయనున్నట్టు పూరీ తెలిపారు. అయితే, షూటింగ్, పోస్ట్ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. తాజాగా హీరో రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ విశేషాలు తెలిపారు. ‘ ‘డబుల్ఇస్మార్ట్’ని జూన్లో విడుదల చేస్తున్నాం. అప్పటికి ఎన్నికల హడావిడి కూడా అయిపోతుంది. ప్రశాంతంగా ‘డబుల్ఇస్మార్ట్’ని ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు.
ఈ సారి వినోదం, యాక్షన్ అన్నీ డబుల్..’ అన్నారు రామ్. పూరీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు నిర్మాతలు పూరీజగన్నాథ్, చార్మి కాగా, మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.