ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి మీకు గుర్తుందా.. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా..! ఒకప్పుడు తెలుగు సినిమాలతో పాటు తమిళ మలయాళ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆ హీరోయిన్ మీరా జాస్మిన్ ( meera jasmine ). పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఉన్నట్టుండి సడన్గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ భామ ఇప్పుడు చాలా సన్నగా మారిపోయింది. పెళ్లి తర్వాత మెరుపుతీగలా మేకోవర్ అయింది మీరా జాస్మిన్. ఈమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
అమ్మో మీరా ఏంటి ఇలా మారిపోయింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. 2003లో శివాజీ హీరోగా వచ్చిన అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మీరా జాస్మిన్. ఆ సినిమా చూసిన తర్వాత నిజంగానే అమ్మాయి బాగుంది అంటూ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చారు. రెండో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ లో అవకాశం అందుకుంది. ఆ తర్వాత రవితేజ భద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత బాలకృష్ణ మహారథి సినిమాలో నటించింది మీరా జాస్మిన్.
కెరీర్ మొదట్లోనే వరుసగా స్టార్ హీరోల సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్.. అంతే వేగంగా మాయమైపోయింది. గోరింటాకు సినిమాలో రాజశేఖర్ చెల్లెలిగా నటించిన మీరా.. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. తెలుగు కంటే తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫోకస్ చేసింది మీరా జాస్మిన్. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. 2014లో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. 39 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ అదిరిపోయే ఫోటోషూట్ చేసింది మీరా జాస్మిన్. ఇది చూసిన తర్వాత కచ్చితంగా ఈమెకు మళ్లీ హీరోయిన్ అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అంతలా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అన్నట్లు తెలుగు ఇండస్ట్రీపై కూడా ఈమె ఫోకస్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Meera jasmine | దాదాపు ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన బబ్లీ బ్యూటీ
Sushanth | రూట్ మార్చిన అక్కినేని మేనల్లుడు
Pooja Hegde | గృహ ప్రవేశం చేసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..
సౌత్ కొరియాలో పుష్ప ‘ఊ అంటావా’ సాంగ్ క్రేజ్ చూస్తే మతిపోతుంది: వైరల్ వీడియో