బాలీవుడ్ భామ దిశా పటానీ వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉంది. ఏడాదంతా ఈ అందాల తారకు పనే పని. ఆమె నాయికగా ఇటీవలే ‘యోధ’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీతో పాటు రాశీ ఖన్నా నాయికగా నటిస్తున్నది. కరణ్ జోహార్ నిర్మాత. ఈ సినిమా నవంబర్ విడుదలకు సిద్ధమవుతున్నది. దిశా నటిస్తున్న మరో భారీ చిత్రం ‘ఏక్ విలన్ రిటర్న్స్’ 2014లో విడుదలైన ‘ఏక్ విలన్’ సినిమాకు ఇది కొనసాగింపు చిత్రం. ఈ సినిమాలో జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది నాకు చాలా బాగుంది. వరుస చిత్రాల్లో నటిస్తున్నాను. ‘ఏక్ విలన్ 2’, ‘యోధ’ ఈ రెండు చిత్రాలు వేటికవే భిన్నమైనవి కావడం నటిగా సంతృప్తినిస్తోందని చెప్పిందీ తార.