పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెట్టింది. అక్కడ భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకొని కెరీర్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నది. తాజాగా ఈ అమ్మడు ఓ బంపరాఫర్ను సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత కరణ్జోహార్ నిర్మిస్తున్న ‘యోధ’ చిత్రంలో ఆమె ఓ కథానాయికగా ఎంపికైంది. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో దిశాపటానీ ప్రధాన నాయికగా నటించనుంది. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల రాఖీఖన్నా ఆనందం వ్యక్తం చేసింది. “యోధ’ వంటి భారీ సినిమాలో అవకాశం దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. వచ్చే నవంబర్లో ఈ సినిమా ప్రేక్షకులముందుకొస్తుంది’ అని రాశీఖన్నా ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ హిందీ వెబ్సిరీస్లో నటించడంతో పాటు తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తున్నది.