షాద్నగర్టౌన్, జూలై 8 : పుడమితల్లి పులకరించే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణ, పల్లె ప్రగతి, హరితహారంలో భాగంగా గురువారం మున్సిపాలిటీలోని 16, 18, 26వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఆర్డీవో రాజేశ్వరి, కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. పట్టణ, పల్లె అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు తమ నివాసాల వద్ద మొక్కలు నాటేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రతాప్రెడ్డి, సర్వర్పాషా, శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యుడు కిశోర్, నాయకులు సూర్యప్రకాశ్, జూపల్లి శంకర్, యుగేందర్, నర్సింహులు పాల్గొన్నారు.
మరింత శుభ్రంగా వార్డులు
షాద్నగర్రూరల్, జూలై 8 : వార్డులు మరింత శుభ్రంగా మారుతున్నాయని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. 7వ వార్డు తిరుమల కాలనీలో కలుపు మొక్కలను తొలగించారు. వార్డుల్లో అంతర్గత మురుగు కాల్వలను శుభ్రం చేశారు. వార్డులు శుభ్రంగా మారుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలి
నందిగామ, జూలై 8 : గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నర్సప్పగూడలో ఏర్పాటు చేసిన నర్సరీని ఎమ్మెల్యే జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డితో కలిసి పరిశీలించారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మరిపోతున్నాయన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ కళమ్మ, నాయకులు యాదగిరి పాల్గొన్నారు.
చెట్లతో మానవ మనుగడ..
షాద్నగర్రూరల్, జూలై 8 : ప్రతి గ్రామం, పల్లె, తండా పచ్చదనంతో కళకళలాడాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని నాగులపల్లిలో సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చెట్లతోనే మానవ మనుగడ ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఇద్రీస్ అహ్మద్, ఎంపీటీసీ రామకృష్ణ, ఇన్చార్జి ఎంపీడీవో మధుసూదన్గౌడ్ పాల్గొన్నారు.
ప్రణాళికా ప్రకారం అభివృద్ధి పనులు
మొయినాబాద్, జూలై 8 : పల్లె ప్రగతిలో పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని డీఆర్డీవో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ నీరజ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించడానికి గురువారం ఎంపీపీ నక్షత్రంతో కలిసి మండల పరిధిలోని కాశీంబౌలి, అమ్డాపూర్, ముర్తుజాగూడ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, నర్సరీలు, డంపింగ్యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా నీరజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల రూపురేఖలు మార్చడానికి పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టిందన్నారు. రెండు రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, కాశీంబౌలి సర్పంచ్ మహేందర్రెడ్డి, ముర్తుజాగూడ సర్పంచ్ మణెమ్మ, కార్యదర్శులు మహేశ్, లావణ్య పాల్గొన్నారు.
హరితతెలంగాణలో భాగస్వాములు కావాలి
షాబాద్, జూలై 8 : హరిత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ముద్దెంగూడ, కేశవగూడ, మరియాపురం, కొమరబండ, బొబ్బిలిగామ గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఆరుమొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నరెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, సర్పంచులు అర్చన, జయమ్మ, చంద్రశేఖర్, కవిత, నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు మధు, మల్లేశ్, నాయకులు ప్రతాప్రెడ్డి, నర్సింహారెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములవ్వాలి
కొందుర్గు, జూలై 8 : మొక్కలు నాటడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ ఆదిలక్ష్మీయాదయ్య అన్నారు. గ్రామంలో హరితహారాన్ని నిర్వహించారు. పచ్చని చెట్లతో గ్రామాలు సుందరంగా మారుతున్నాయన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
కొత్తూరు, జూలై 8 : పల్లెలు, పట్టణాలు పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అన్నారు. దర్గా రోడ్డులోని మీ సేవ, పాత జాతీయ రహదారిపై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ 5 మొక్కలు ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటాలని కోరారు. మున్సిపాలిటీలో అవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవీందర్, కమిషనర్ వీరేందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్యాదవ్, రవినాయక్, ఆంజనేయులుగౌడ్, సిటీ కేబుల్ వెంకటేశ్ పాల్గొన్నారు.
పారిశుధ్యంపై దృష్టి సారించాలి
చేవెళ్ల టౌన్, జూలై 8 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా కౌకుంట్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గాయత్రి, ఉప సర్పంచ్ ఇనాయత్, సెక్రటరీ స్వామి పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
నందిగామ, జూలై 8 : అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. గురువారం పల్లె ప్రగతిలో గ్రామంలో పాడుబడిన ఇండ్లను జేసీబీ సాయంతో సర్పంచ్ కూల్చి వేయించారు. పల్లె ప్రగతి జిల్లా ప్రత్యేకాధికారి మోతి నందిగామలో పర్యటించి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల్రెడ్డి, ఎంపీవో గిరిరాజ్, ఐసీడీఎస్ సుపర్వైజర్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.
గ్రామస్తుల సహకారం అవసరం
చేవెళ్లటౌన్, జూలై 8 : పల్లె ప్రగతిలో భాగంగా గుండాల గ్రామంలో సర్పంచ్ ప్రణతి రోడ్లులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల్రాజ్, ఎంపీటీసీ సుజాత రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, కార్యదర్శి ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు.
చెట్లే జీవనాధారం..
కొత్తూరు రూరల్, జూలై 8 : చెట్లు మానవాళికి జీవనాధారమని ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండల పరిధిలోని మల్లాపూర్లో సర్పంచ్ సాయిలు నిర్వహించిన హరితహారానికి ఎంపీపీ మధుసూదన్రెడ్డి హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, ఉపసర్పంచ్ హరిత పాల్గొన్నారు.