టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల (Sreenu Vaitla) వ్యవసాయ క్షేత్రాన్ని సంరక్షించే (కేర్ టేకర్) వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ట్వీట్ ద్వారా తెలియజేశాడు. నా ఫాం కేర్ టేకర్ శ్రీనును అత్యంత ప్రమాదకరమైన సర్పాల్లో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటు వేసింది. చుట్టుపక్కల ఉన్న రైతుల సాయంతో అతన్ని వెంటనే సిటీలోని ఆస్పత్రికి తరలించాం. వీలైనంత త్వరగా చికిత్సనందించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.. అంటూ శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్టిల్ను ట్వీట్ చేశాడు శ్రీను వైట్ల.
ఒక బాధ్యతగా తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి యోగక్షేమాలు చూసుకున్న శ్రీనువైట్లకు పలువురు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీను వైట్ల ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ చివరగా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు.
మంచు విష్ణుతో ఇప్పటికే ఢీ సీక్వెల్ ప్రకటించాడు శ్రీనువైట్ల. అయితే ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ రావాల్సి ఉంది. శ్రీను వైట్ల ఎలాంటి సినిమాతో కమ్ బ్యాక్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
My farm care-taker Sreenu was bitten by one of the most venomous snakes, Russell's Viper and we could save him by rushing him to the hospital in the city immediately, with the help of neighbouring farmers..
"Treatment at the earliest" saves lives !! pic.twitter.com/D475UdCcsl— Sreenu Vaitla (@SreenuVaitla) November 8, 2022
Read Also: Samantha | ఫైట్స్ అంటే చాలా ఇష్టం.. యశోదను ఎందుకు చూడాలో చెప్పిన సమంత
Read Also: Prakash Raj | కొత్త ప్రకాశ్రాజ్ను చూస్తారు.. రంగమార్తాండ సినిమాపై విలక్షణ నటుడు
Read Also: Karthi25 | వినూత్న టైటిల్తో కార్తి కొత్త సినిమా..!