Actor Karthi | తమిళ హీరో కార్తి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన ‘విరుమన్’, ‘PS-1’, ‘సర్దార్’ మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ మూడు బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే జోష్తో వరుసగా సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్తాడు. కాగా తాజాగా కార్తి తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. రాజమురుగన్ దర్శకత్వంలో కార్తి తన 25వ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘జపాన్’ అనే పేరును ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా గ్రాండ్గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికు జోడీగా అను ఇమాన్యూయేల్ హీరోయిన్గా నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. చెన్నైలో ఈ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఇక కార్తి ఇటీవలే సర్దార్తో భారీ విజయం సాధించాడు. పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
Delighted to announce that @Karthi_Offl starrer #Japan pooja happened today, need all your love 😊#ஜப்பான் @Dir_Rajumurugan @gvprakash @ItsAnuEmmanuel @vijaymilton @prabhu_sr pic.twitter.com/HOxLWeI1UO
— DreamWarriorPictures (@DreamWarriorpic) November 8, 2022