వేములవాడ: ప్రముఖ సినీ దర్శకుడు సంపత్ నంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడ వచ్చిన ఆయన ఎములాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సంపత్ నంది దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాకు సంబంధించిన స్కి్ప్టును రాజన్న పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశామన్నారు. త్వరలో సీనియర్ హీరో బాలకృష్ణతో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.