అమరావతి : ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడెపల్లి నివాసంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ నెల 25న ‘ఆర్ఆర్ఆర్`సినిమా విడుదల అవుతున్న సందర్భంగా జగన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుదల, తమ సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి విషయంలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు టికెట్ల ధరల పెంపు అంశంతో పాటు ప్రత్యేక ప్రదర్శలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.