ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జాన్వీకపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. ఎన్టీఆర్, జాన్వీకపూర్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు రాజమౌళి క్లాప్నివ్వగా, కొరటాల శివ కెమెరా స్విఛాన్ చేశారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఎన్టీఆర్తో రెండో చిత్రమిది. ‘
జనతా గ్యారేజ్’ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. విస్మరణకు గురైన ఓ సుదూర ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అక్కడ మనుషుల కంటే ఎక్కువగా మృగాలుంటాయి. ఆ మృగాలకు దేవుడంటే, చావంటే భయం లేదు. అలాంటి వాళ్లను భయపెట్టడానికి కథానాయకుడు ఏం చేశాడు? ఏ స్థాయికి వెళ్లాడనేది పంచుతుంది. నా కెరీర్లో ఉత్తమ చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రత్నవేలు, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్: యుగంధర్, సమర్పణ: నందమూరి కల్యాణ్రామ్, రచన-దర్శకత్వం: కొరటాల శివ. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.