రఘు, వెంకట్, మోహన సిద్ధి, పాయల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రను పోషిస్తున్నారు. రమేష్ రావుల నిర్మిస్తున్నారు. పాలిక్ శ్రీనివాస చారి దర్శకుడు. హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్లో ఆన్ లొకేషన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ…‘సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిస్తున్నాం.
ప్రస్తుతం హైదరాబాద్ బూత్బంగ్లాలో భారీ ఫైట్ చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ చివరి షెడ్యూల్తో సినిమా పూర్తవుతుంది’ అన్నారు. నటుడు కాలకేయ ప్రభాకర్ మాట్లాడుతూ…‘ కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రమిది’ అన్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని నిర్మాత రమేష్ రావుల అన్నారు.