తిరుమల : ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ( Boyapati Srinivas ) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు వేగంగా దర్శనబాగ్యం కల్పిస్తున్నారని వివరించారు. త్వరలో తాను చేయబోయే సినిమాకు సంబంధించిన కథ చర్చల దశలో ఉందని, త్వరలో కొత్త సినిమా వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.
రవితేజ హీరోగా మొదటి సినిమా తీసిన బోయపాటి వెంకటేశ్తో తులసి , నందమూరి బాలకృష్ణతో సింహా , లెజెండ్ , అఖండ , అల్లు అర్జున్తో సరైనోడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జయ జానకి నాయక , రామ్ చరణ్తో వినయ విధేయ రామ, రామ్ పోతినేనితో స్కంద సినిమాలు తీశారు.