బాలీవుడ్లో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే షారుక్ ఖాన్. గత మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. అంతకుముందు కూడా వరుసగా మూడు నాలుగు ఫ్లాపులతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు షారుక్ సినిమా వచ్చింది అంటే బాక్సాఫీస్ బద్దలు అయిపోయేది. అందుకే ఈయనను బాలీవుడ్ బాద్ షా అంటారు. అయితే 2013లో వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత షారుక్ ఆస్థాయి విజయం మళ్లీ అందుకోలేదు. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయింది కానీ దాన్ని హిట్ లిస్టులోకి ఎవరూ చేర్చుకోలేదు.
ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాయిస్, ఫ్యాన్, జీరో, జబ్ హ్యారీ మెట్ సెజల్ వంటి సినిమాలు వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కెరీర్లో ఎప్పుడూ లేనంతగా బ్రేక్ తీసుకున్నాడు షారుక్ ఖాన్. మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం దక్షిణాది సంచలనం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించబోతోంది. కేవలం నయన్ మాత్రమే కాదు షారుక్ సినిమాలో ఎక్కువగా సౌత్ డామినేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ.
గతంలో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఎక్కువగా సౌత్ ఆర్టిస్టులు నటించారు. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి అట్లీ కుమార్ ఇదే చేయబోతున్నాడు. షారుక్ సినిమాలో ఎక్కువగా దక్షిణాది నుంచి నటీనటులను తీసుకుంటున్నాడు. మరోవైపు కథ నచ్చడంతో బాద్షా కూడా ఈ కుర్ర దర్శకుడికి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. 2022 లో ఈ సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
యజ్ఞం అసలు హీరో గోపీచంద్ కాదు.. మరి ముందు అనుకున్నది ఎవర్ని..?
సంపాదించినది అప్పులకే సరిపోయింది.. కన్నీరు పెట్టుకున్న రోజా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
మేము ఐదుగురం కాదు.. ఎనిమిది మంది.. మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్