దినేష్ తేజ్ హీరోగా, హెబ్బాపటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా నటిస్తున్న నూతన చిత్రం ‘అలా నిన్ను చేరి’ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరో,హీరోయిన్స్పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్వీచ్చాన్ చేయగా, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు క్లాప్ నిచ్చారు. రొమాంటిక్ లవ్స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీజీ విందా.