బాలీవుడ్ దిగ్గజం నటుడు దిలీప్ కుమార్ శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని హిందూజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇంటెన్సివ్ కేర్ కి తరలించి ఆక్సిజన్ సపోర్ట్ అమర్చి వైద్యం అందించగా,కొద్ది గంటటలోనే ఆయన మళ్లీ మామలు స్థితికి వచ్చారట. బుధవారం ఆయనకు ‘ప్లూరల్ యాస్పిరేషన్’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసిజర్ జరిగింది.
ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫరూకి తెలిపారు. గురువారం దిలీప్ కుమార్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఆయన ఇద్దరు తమ్ముళ్ళు మరణించారు. దాంతో అప్పటి నుంచి దిలీప్ కుమార్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. సోషల్ మీడియాలో మాత్రం దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమించింది అంటూ తప్పుడు వార్తలు ప్రచారం కాగా, ఆయన భార్య సైరా బాను ఈ లెజెండరీ నటుడు ఆరోగ్యం గురించి ఒక ట్వీట్ చేశారు. బయట వస్తున్న వార్తలను అసలు నమ్మవద్దు అంటూ అభిమానులను ఆమె కోరారు.