komatireddy venkat reddy | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్నాయని తెలిసిందే. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఫెడరేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఫిలిం ఛాంబర్తో చర్చలు జరిపారు. మరోవైపు కార్మికులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. అదేవిధంగా సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై నిర్మాతలు చిరంజీవితో సమావేశమై చర్చలు కూడా జరుపగా.. ఇప్పటికీ ఇంకా కార్మికులకు మాత్రం ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు నిర్మాతలు హాజరయ్యారు. ఈ భేటీలో నిర్మాతలు, కార్మికుల వివాదంపై చర్చిస్తున్నట్టు సమాచారం. సమావేశంలో బాపినీడు, సుప్రియ, జెమినీ కిరణ్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లకు సంబంధించిన విషయాలు, తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొద్దిసేపట్లో సినీ కార్మిక నేతలు మంత్రి కోమటిరెడ్డితో సమావేశం కానున్నారు.
కాగా సినీ కార్మికుల ఆందోళనలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారని తెలిసిందే. సినీ కార్మికుల వేతనాలను పెంచాల్సిన అవసరముందని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీ అంశాలన్నీ దిల్ రాజుకు అప్పగించామని… సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు చర్చిస్తున్నారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. మరి తాజాగా వరుస సమావేశాల నేపథ్యంలో కార్మికుల వేతన సమస్యలపై ఏమైనా పరిష్కారం లభిస్తుందా అనేది చూడాలి.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
Madharaasi | శివకార్తికేయన్ నయా అవతార్.. మదరాసి మేకింగ్ వీడియో వైరల్
Baaghi 4 Teaser | టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 4’ టీజర్ విడుదల