Dil Raju | టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) మేనల్లుడు అశిష్ రెడ్డి (Ashish reddy)-అద్విత రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నాడని తెలిసిందే. వీరి నిశ్చితార్థం 2023 నవంబర్లో జరుగగా.. జైపూర్లో జరుగనున్న ఈవెంట్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఫిబ్రవరి 14న జైపూర్లో ఘనంగా వివాహ వేడుక నిర్వహించేందుకు రెడీ అవుతుంది దిల్ రాజు కుటుంబం.
ఈ నేపథ్యంలో దిల్ రాజు, శిరీష్ ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందజేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అశిష్ రెడ్డి వెడ్డింగ్ ఈవెంట్కు రావాల్సిందిగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందించారని తెలిసిందే. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, యాక్టర్లు అక్కినేని నాగార్జున, వెంకటేశ్కు శుభలేఖ అందించారు దిల్ రాజు, శిరీష్. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే తారక్కు దిల్ రాజు, శిరీష్, అశిష్ ఆహ్వానం అందిస్తున్న స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అద్విత రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త కూతురు. 2022లో రౌడీ బాయ్స్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అశిష్ రెడ్డి ప్రస్తుతం యూత్ఫుల్ ఎంటర్టైనర్ సెల్ఫిష్ సినిమాలో నటిస్తున్నాడు.
#DilRaju & #Shirish personally invited @RagavendraRaoBa garu,
@VenkyMama garu and @IamNagarjuna garu to grace @AshishVOffl’s wedding with their presence. pic.twitter.com/13unI3qJ2e— BA Raju’s Team (@baraju_SuperHit) February 1, 2024