Deepika Padukone | బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె తాజాగా మరో బంపరాఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్తో కింగ్ సినిమాతో పాటు అల్లు అర్జున్తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది ఈ భామ. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్లో దీపిక (Deepika Padukone) భాగం కాబోతున్నట్లు సమాచారం. ‘స్త్రీ 2’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అమర్ కౌశిక్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్తో (Vicky Kaushal) కలిసి ‘మహావతార్’ (Mahavatar) అనే చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. మైథాలాజీ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికాను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరుపగా దీపికా కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
పరశురాముడి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్లో దీపికా పదుకొణె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలరని చిత్ర యూనిట్ బలంగా విశ్వసిస్తోందట. అందుకే ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు అమర్ కౌశిక్, ఇప్పటికే ఆరు నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇది తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన సినిమా అవుతుందని పేర్కొన్నారు.