ముంబయి: బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత మనస్పర్థల కారణంగా ఈ జంట విడుపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా నటి స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక.. రణ్వీర్తో తన బంధం గురించి వివరించారు.
‘‘రణ్వీర్తో నా బంధం అన్యోన్యంగా సాగుతోంది. మ్యూజిక్ ఫెస్టివల్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గత వారం నా భర్త వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఇప్పుడే తిరిగి ఇంటికి వచ్చాడు. రాగానే నన్ను చూసి చాలా సంతోషించాడు’’ అని చెప్పుకొచ్చారు. దీంతో విడాకుల వార్తకు చెక్ పడినట్లైంది.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘‘రామ్ లీలా’’ చిత్రం కోసం ఈ జంట తొలిసారిగా కలిసి పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో.. 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.