విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ను హీరో బాలకృష్ణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…‘తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారు. ట్రైలర్ వినూత్నంగా ఉంది. సినిమా కోసం విశ్వక్ సేన్ ప్యాషన్ ఇందులో కనిపిస్తున్నది. దర్శకత్వం, నిర్మాణం వంటి బాధ్యతలు వహిస్తూ హీరోగా నటించడం సాధారణ విషయం కాదు. ఇలాంటి చిత్రాల్లో నేనే నటిస్తున్నట్లుగా ఊహించుకుంటాను.
థియేటర్లో చూడాల్సిన చిత్రమిది. ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమాను నా దర్శకత్వంలో రూపొందిస్తా’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘ఏడాదిపాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. రూపకల్పనలో ఎక్కడా రాజీ పడలేదు. బాలకృష్ణ గారు మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది’ అన్నారు. నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ…‘ఈ ఒక్క చిత్రం కోసం నాలుగు సినిమాలకు పనిచేసినంత కష్టపడ్డాడు విశ్వక్ సేన్. అతని కెరీర్లో మరో మంచి సినిమా అవుతుంది’ అన్నారు.