లక్నో : టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూసింగ్ తన బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టాడు. ఆదివారం సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను రింకూసింగ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. నగరంలోని ప్రముఖ హోటల్లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ, క్రీడారంగ ప్రముఖలు హాజరయ్యారు. ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో రింకూ, ప్రియ ఉంగరాలు మార్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్యాదవ్, ఆయన భార్య డింపుల్, రాజీవ్శుక్లా, జయాబచ్చన్, శివపాల్యాదవ్, క్రికెటర్లు భువనేశ్వర్కుమార్, పీయూశ్చావ్లా హాజరయ్యారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ఆడిన రింకూసింగ్..టీమ్ఇండియా టీ20 టీమ్లో కీలక క్రికెటర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు మచిలీషహర్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ప్రియ లోక్సభ ఎంపీగా వ్యవహరిస్తున్నది.