అగ్రకథానాయకుడు కమల్హాసన్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్లొచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ ద్వారా ఆయన ఓ ప్రకటన చేశారు. ‘అమెరికా నుంచి వచ్చిన తర్వాత స్వల్పంగా జలుబు, దగ్గు మొదలైంది. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం నేను ఆసుపత్రి ఐసోలేషన్లో ఉన్నా. ఇంకా కరోనా ప్రమాదం తొలగిపోలేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని కమల్హాసన్ కోరారు. ప్రస్తుతం కమల్హాసన్ ‘విక్రమ్’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.