Bigg Boss Telugu 7 | బిగ్ బాస్ ఓన్లీ ఫర్ బాయ్స్ అన్నట్టుంది పరిస్థితి ఇప్పుడు. ఇంట్లో కేవలం అబ్బాయిలు మాత్రమే ఉండాలి అమ్మాయిలు ఉన్నది ఎలిమినేట్ అవ్వడానికే అన్నట్టు మారిపోయింది అక్కడ పరిస్థితి. హౌస్లోకి 4 మంది వస్తే అందులో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. కానీ మొదటి ఐదు వారాలు వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదటివారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతిక, ఐదో వారం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. కనీసం ఆరో వారం అయినా అబ్బాయి ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే అలాంటిదేమీ జరిగలేదు. ఎందుకంటే ఈ వారం కూడా అమ్మాయి బయటకు వచ్చేసింది.
నిజానికి గతవారం శుభశ్రీ ఎలిమినేషన్ తర్వాత ఏకంగా ఇంట్లోకి ఐదుగురు కొత్తహౌస్ మేట్స్ ను పంపించారు. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని ముందు నుంచి నాగార్జున చెబుతూనే ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఏది అక్కడ ఊహకు అందినట్టు జరగడం లేదు. ఈవారం కచ్చితంగా వీళ్లు ఎలిమినేట్ అవుతారు అనుకున్న వాళ్లేమో సేవ్ అవుతున్నారు. వీడు పక్కా సేఫ్ అనుకున్న ప్లేయర్ మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఈ వారం కూడా అలాంటి ఎలిమినేషన్ చోటుచేసుకుంది.
ఇంట్లోకి వచ్చిన వారం రోజుల్లోనే నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. యూ ట్యూబ్లో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. వైల్డ్ కార్డ్తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చిన వారం రోజుల్లో పర్ఫార్మెన్స్ పెద్దగా ఏం లేదు. టాస్క్ దగ్గరికి వచ్చేసరికి కూడా కామ్గా కూర్చుంది నయని పావని. దాంతో ప్రేక్షకులు ఈమెపై శీత కన్ను వేశారు. దాని ఎఫెక్ట్ త్వరగానే కనిపించింది. వచ్చిన వారం రోజుల్లోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది పావని. మరోవైపు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన దామిని, రతిక రోజ్, శుభశ్రీ నుంచి ఒకరిని ఇంట్లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు బిగ్ బాస్. మొత్తానికి చూడాలి ఈ సీజన్లో ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్లే మేల్ కంటెస్టెంట్ ఎవరో..!
“BiggBoss 7 Telugu | బిగ్బాస్లో ఊహించని ట్విస్ట్.. శోభాశెట్టి కోసం ఆమెను బలి చేశారా?”