బాలీవుడ్ నటి కరీనాకపూర్ ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పుస్తకం టైటిల్ పై క్రిస్టియన్ గ్రూప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని బీడ్ సిటీలో అల్ఫా ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్ ప్రెసిడెంట్ ఆశిష్ షిండే శివాజీ నగర్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రెగ్నెన్సీ బైబిల్ రాసిన కరీనా కపూర్, అదితి షా భింజాని, ప్రచురించిన జుగ్గర్నౌట్ బుక్స్ పేర్లను ఫిర్యాదులో నమోదు చేశారు.
పుస్తకం టైటిల్లో పవిత్రమైన బైబిల్ పదాన్ని వాడి క్రైస్థవుల మనోభావాలను దెబ్బదీశారని ఆశిష్ షిండే ఆరోపించారు. కరీనాకపూర్ తోపాటు మిగిలిన వారిపై ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. పుస్తకం టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు వచ్చింది. అయితే ఈ విషయం ముంబై పరిధిలో ఉండటంతో అక్కడి పీఎస్ లో ఫిర్యాదు చేయాలని సూచించామని, ఎఫ్ఐఆర్ ఏం నమోదు చేయలేదని పోలీస్ ఉన్నతాధికారి సాయినాథ్ తోంబ్రే తెలిపారు.
జులై 9న ప్రెగ్నెన్సీ బైబిల్ ను లాంఛ్ చేసింది కరీనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బాబుకు జన్మనిచ్చిన కరీనా..ప్రెగ్నెన్సీ బైబిల్ తనకు మూడో సంతానం అని అభివర్ణించింది. ప్రెగ్నెన్సీ సమయంలో తాను శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న అనుభవాలను పుస్తకంలో రాసింది కరీనా.
ఇవి కూడా చదవండి..
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!