Raju Srivastava Health Update | ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రాజును కలిసేందుకు భార్య, పిల్లలకు ఎయిమ్స్ వైద్యులు అనుమతించారు. స్టార్ కమెడియన్ జిమ్ చేస్తూ గుండెపోటుతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత 27 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యమం మెరగువుతున్నది. ఎయిమ్స్ వైద్యులు కుటుంబీకులను కలిసేందుకు అవకాశం ఇవ్వడంతో కూతురు అంతర, భార్య ఐసీయూలోకి వెళ్లి కలిశారు.
అయితే, వెంటిలేటర్ను తొలగించలేదని, ఇది ఆందోళన కలిగించే విషయమని రాజు సోదరుడు మీడియాతో తెలిపాడు. రాజు బాధ్యతను యూపీ ప్రభుత్వం రెసిడెంట్ కమిషనర్కు అప్పగించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజు కాళ్లు, చేతులను కదుపుతున్నాడని, పూర్తిగా కోలుకునేందుకు సమయంపట్టవచ్చని కుటుంబీకులు తెలిపారు. ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందని రాజు శ్రీవాస్తవ ముఖ్య సలహాదారు అజిత్ సక్సేనా చెప్పారు. రాజు కాళ్లలో కదలిక వచ్చిందని, అలాగే భార్య శిఖా శ్రీవాస్తవతో మాట్లాడినట్లు సక్సేనా పేర్కొన్నారు.