హైదరాబాద్: వేతనాల పెంపుకోసం సినీ కార్మికులు సమ్మె బాటపట్టారు. హైదరాబాద్లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. యూనియన్లవారీగా ఫెడరేషన్ ఆఫీస్కు చేరుకున్నారు. తమ వేతనాలు పెచాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆందోళనల్లో 400 మందికిపైగా కార్మికులు పాల్గొన్నారు. తమ వేతనాలను సవరించే వరకు ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
బుధవారం ఉదయం సినిమా షూటింగ్లకు ఒక్కరు కూడా హాజరుకాలేదు. దీంతో 20కిపైగా పెద్ద సినిమాలు వాయిదాపడ్డాయి. కాగా, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులను నిర్మాతల మండలి చర్చలకు ఆహ్వానించింది. కార్మికుల వేతనాల సవరణపై చర్చించనున్నారు.