‘తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సీఎం.వైఎస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలను పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్కు రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు (నమస్తే తెలంగాణ కాదు) వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం’ అని పేర్కొన్నారు సీనియర్ నటులు చిరంజీవి. ఇటీవల ఏపీ సీఎం జగన్తో భేటి అయిన సందర్భంగా తనపై కొన్ని వార్త సంస్థలు ప్రసారం చేస్తున్న వార్తలపై సోషల్మీడియా వేదికగా స్పందించారు నటులు చిరంజీవి. ‘రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావడం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్స్టాప్ పెట్టమని కోరుతున్నాను’ అంటూ ట్విట్టర్లో తెలిపారు చిరంజీవి.