నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సీవీఎం), డా॥ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. నాని నటిస్తున్న 30వ చిత్రమిది కావడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నటుడు చిరంజీవి క్లాప్నివ్వగా, అశ్వనీదత్ కెమెరా స్విఛాన్ చేశారు. ‘విభిన్న కథాంశమిది. నాని పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఆయన కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుంది’ అని దర్శకుడు పేర్కొన్నాడు. బుధవారం నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాద్, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్, దర్శకత్వం: శౌర్యువ్.