రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాల కథానాయకుడు చేతన్ మద్దినేని తాజాగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి కిషోర్ దర్శకత్వంలో చేతన్ మద్దినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ మాట్లాడుతూ ‘ఫస్ట్ ర్యాంక్ రాజు తరువాత చాలా కథలు విన్నాను. కొన్ని ఆఫర్స్ వచ్చాయి.
ఈ సమయంలోనే గోపీ మోహన్ గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ఓకే చేశాను. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. గోపీ సుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుంటుంది. హెబ్బాపటేల్ పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంటుంది’ అన్నారు.