ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది కథానాయిక కేథిరిన్ ట్రెసా. ప్రస్తుతం ఈ భామ సందీప్మాధవ్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నది. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీమహా విష్ణువు మూవీస్ పతాకంపై దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్తేజ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
ఈ సందర్భంగా ఆదివారం సినిమా సెట్లో కేథరిన్ ట్రెసా జన్మదిన వేడుకలు జరిగాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, త్వరలో టైటిల్ను ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. కేథరిన్ ట్రెసా మాట్లాడుతూ ‘నా కెరీర్లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. నా పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. చక్కటి అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: అనూప్ రూబెన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అశోక్తేజ.