శుక్రవారం సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆయనను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికత్స పూర్తయ్యాక మెరుగైన చికిత్స కోసం అపోలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం
సాయి తేజ్ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అయితే తాను బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున ఐపీసీ సెక్షన్ 336 మరియు 184 సెక్షన్ల పై కేసు నమోదు చేసి అతని బైక్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్కు తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. కీలక అవయవాలకు పెద్దగా గాయాలు కాలేదు కానీ మెడ ప్రాంతంలో ఎముక కణజాలం దెబ్బ తింది అని వైద్యులు తెలియజేసారు.