ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు మనది కానీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఒక్క పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడిందంటే వాళ్ళ పేరు వద్దన్నా అన్ని ఇండస్ట్రీల్లో మార్మోగిపోతుంది. తాజాగా రిషబ్ శెట్టి (Rishab Shetty) విషయంలో ఇదే జరుగుతుంది. కాంతార విడుదల ముందు వరకు.. కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఒకే ఒక సినిమాతో అన్ని ఇండస్ట్రీలను తన వైపు తిప్పుకున్నాడు ఈ డైరెక్టర్ కమ్ హీరో. కేవలం 18 కోట్లతో తెరకెక్కిన కాంతార (Kantara ) 400 కోట్లకు పైగా వసూలు చేయడంతో రిషబ్ శెట్టి మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. అటు హీరోగా.. ఇటు దర్శకుడిగా సూపర్ ఫామ్ లో ఉన్న రిషబ్ శెట్టి కోసం ఏకంగా 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు.
ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో 10 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచించే నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం ఒక్క సినిమా కోసం 50 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేస్తున్నారు. తన తర్వాత సినిమా 200 కోట్ల బడ్జెట్ తో ఉంటుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు రిషబ్ శెట్టి. అందులో ఆయన రెమ్యూనరేషన్ నాలుగవ వంతు ఉండబోతుంది.
మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఈ మల్టీ టాలెంటెడ్ హీరోకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అయితే ఏ ఇండస్ట్రీ తనను పిలిచినా కూడా కన్నడ సినిమాకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పాడు రిషబ్ శెట్టి. మొత్తానికి దర్శకులకు పెరుగుతున్న మార్కెట్ తో హీరోలు ఇబ్బంది పడుతున్నారు.
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ