బాలీవుడ్ (Bollywood) నుంచి త్వరలో సందడి చేయనున్న భారీ సినిమా బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నాడు. మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియాభట్ (Alia bhatt) లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. బీటౌన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , మౌనీరాయ్, టాలీవుడ్ యాక్టర్ నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్గా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో..ఈ సినిమా అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయమేంటంటే బ్రహ్మాస్త్ర స్పెషల్ షోను హైదరాబాద్లో వేయబోతున్నారట. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల కోసం వేయనున్న ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇటీవలే లాల్ సింగ్ చద్ధా స్పెషల్ షోకు చిరు హాజరైన విషయం తెలిసిందే.
మరోసారి బ్రహ్మాస్త్ర స్పెషల్ స్క్రీనింగ్ న్యూస్ తెరపైకి రావడంతో..స్పెషల్ షో ఈ చిత్రానికి బాగా కలిసొస్తుందన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. రణ్ బీర్ అండ్ టీం ఆయా రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని హిందీపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
బ్రహ్మాస్త్ర చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మూడు పార్టులుగా రాబోతుంది బ్రహ్మాస్త్ర.