విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియాసచ్ దేవ్ ప్రధాన పాత్రల్లో సహస్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. బసి రెడ్డి రానా దర్శకత్వంలో నాగేంద్ర బుచ్చిరెడ్డి గారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ క్లాప్నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను ఈ నెల 14న ప్రారంభిస్తాం’ అన్నారు. సాక్షి శివ, శ్రీదర్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లిజో కె జోష్, సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్.