ముంబై, ఆగస్టు 2: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్(57) తనువు చాలించారు. 30 ఏండ్ల పాటు బాలీవుడ్కు సేవలందించిన ఆయన బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. రాయగఢ జిల్లా కర్జాత్లోని ఆయన సొంత స్టూడియోలో ఉరి వేసుకున్న స్థితిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తున్నది. గత కొంతకాలంగా ఆయన స్టూడియోలో కార్యకలాపాలు నడవడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆయనకు రూ.252 కోట్ల అప్పులు ఉన్నట్టు సమాచారం. దీనికి తోడు 2016, 2018లో ఈసీఎల్ ఫైనాన్స్ నుంచి తీసుకొన్న రూ.185 కోట్లు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లగా రుణాన్ని తిరిగి చెల్లించాలని ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన కంపెనీ ఎన్డీ ఆర్ట్ వరల్డ్ ప్రై. లిమిటెడ్ కోర్టులో ఐపీ కూడా పెట్టింది.
లగాన్, జోదా అక్బర్, దేవదాస్ వంటి హిట్ సినిమాలకు నితిన్ దేశాయ్ ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయన కృషికి ఫలితంగా నాలుగు జాతీయ అవార్డులు వరించాయి. నిర్మాత, దర్శకుడిగా పని చేశారు.