Kangana Ranaut | నవాజుద్దీన్ సిద్దిఖీ వ్యవహారం ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. నవాజుద్దీన్పై అతని భార్య ఆలియా సంచలన వ్యాఖ్యలు చేయడం, అతనిపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. నవాజుద్దీన్ అనుకున్నంత మంచోడు కాదని.. తనను మానసికంగా ఎంతో వేధించడానికి ఆలియా చేసిన ఆరోపణలు ఇప్పుడు వైరల్గా మారింది. ఈ క్రమంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ – ఆలియా వ్యవహారంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. నవాజుద్దీన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందని.. ఆయన్ను చాలా అవమానిస్తున్నారని వాపోయింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘంగా ఒక స్టోరీని పోస్టు చేసింది.
‘ ఇదంతా చూడ్డానికి చాలా బాధగా ఉంది. నవాజ్ సార్ను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అవమానిస్తున్నారు. నవాజ్ సార్ తన కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. కొన్నేళ్లు అద్దె ఇంట్లో ఉండి.. రిక్షాల్లో షూటింగ్లోకి వెళ్లి సంపాదించిన డబ్బుతో ఈ బంగ్లా కొనుకున్నాడు. ఇలాంటి టైమ్లో మాజీ భార్య వచ్చి ఈ ఇల్లు తనదని చెబుతోంది.’ అంటూ కంగనా రాసుకొచ్చింది.
అంతటితో ఆగకుండా.. ‘ ఆమెకు నవాజుద్దీన్ ఎప్పుడో విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి దుబాయిలో ఉంటుంది. మాజీ భార్య కోసం ముంబైలో ఒక ప్లాట్ కొన్నాడు. నవాజుద్దీన్ అమ్మ కోసం ఒక బంగ్లా కొన్నాడు. ఆ ఇంటి డిజైనింగ్ కోసం నా దగ్గర చాలా చిట్కాలు తీసుకున్నాడు. మేమంతా ఆ ఇంట్లో పార్టీ చేసుకున్నాం. ‘ అని తెలిపింది.
నవాజుద్దీన్ భార్యను తాను ఇంతవరకు కలవలేదని కంగనా రనౌత్ చెప్పింది. కానీ ఇప్పుడామె హఠాత్తుగా వచ్చి బంగ్లాను స్వాధీనం చేసుకుందని.. నవాజుద్దీన్ను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన రోడ్డుపై నిలబడటం చూశానని.. ఇది ఎంత దుర్మార్గమని ప్రశ్నించింది. అది తలచుకుంటేనే ఏడుపు వస్తుందని వాపోయింది. యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి సంపాదించిన ఇంటిని ఆమెకు ఎలా ఆక్రమించాలని అనిపించిందో తెలియడం లేదంటూ బాధగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.