Kangana Ranaut | ఇప్పుడు ఎక్కడ చూసినా మన సినిమాలదే హవా. బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తర్వాత బాలీవుడ్ దృష్టి మొత్తం సౌత్ ఇండస్ట్రీపైనే పడింది. ఇప్పుడు ఆ మానియా మరింత పెరిగిపోయింది. అందుకు అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమానే అందుకు నిదర్శనం. ఈ సినిమా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ లాభాలను తీసుకొచ్చింది. అంతలా సౌత్ ఇండస్ట్రీకి ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే సౌత్ హీరోలకు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఉచిత సలహాలిస్తున్నది.
సినిమాల కంటే కూడా ఎక్కువగా కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కంగనా రనౌత్. బాలీవుడ్, నెపోటిజంపై ఎప్పుడూ విరుచుకుపడే కంగనా.. మరోసారి బాలీవుడ్పై విమర్శలు గుప్పించింది. అదే సమయంలో సౌత్ ఇండస్ట్రీని పొగడ్తలతో ముంచెత్తింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ హీరో యశ్ ఫొటోలను షేర్ చేస్తూ.. సౌత్ సినిమాలకు, సౌత్ హీరోలకు ఎందుకు అంత క్రేజ్ వస్తుందో కారణాలు వివరించింది. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. వాళ్లు తమ కుటుంబాలను ప్రేమిస్తారు. పాశ్చాత్య సంస్కృతిని పాటించకుండా బాంధవ్యాలకు ఎక్కువ విలువనిస్తారు. వృత్తిపట్ల వారు నిబద్ధతతో ఉంటారని తెగపొగిడేసింది కంగనా. అంతటితో ఆగకుండా సౌత్ స్టార్స్కు సలహాలు కూడా ఇచ్చింది. బాలీవుడ్ మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించవచ్చు.. వాళ్ల వలలో పడకండి అంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్టు చేసింది. దీనికి పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మామా సాంగ్ను కూడా యాడ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Unstoppable | చిరంజీవిని కాదని బాలయ్యతో అన్ స్టాపబుల్ చేయడానికి కారణాలేంటి?
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
RC15 | ఒక్క పాటకే 25 కోట్లా.. మరి సినిమా టోటల్ బడ్జెట్ ఎంత?