Janhvi Kapoor | బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ గత కొంతకాలంగా యువ పారిశ్రామికవేత్త, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట ముంబయిలో జరిగిన పలు ప్రైవేట్ పంక్షన్స్లో కలిసి సందడి చేశారు. జాన్వీకపూర్ పుట్టిన రోజున ఆమెకు ఇన్స్టాగ్రామ్ వేదికగా శిఖర్ పహారియా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో వారిద్దరి లవ్ఎఫైర్ నిజమే అనే వార్తలకు బలం చేకూరినట్లయింది.
శనివారం ముంబయిలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జాన్వీకపూర్ తండ్రి బోనీ కపూర్…శిఖర్ పహారియాతో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా వీరిద్దరు కలిసి కొంతసేపు ప్రైవేట్గా సంభాషించుకున్నారు. దీంతో జాన్వీకపూర్ ప్రేమాయణానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్సిగ్నల్ లభించిందని, అందుకే బోనీకపూర్తో శిఖర్ పహారియా చనువుగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం జాన్వీకపూర్ తెలుగులో ఎన్టీఆర్ 30 చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.