కన్నడ సోయగం రష్మిక మందన్న ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. టాలీవుడ్లో తొలి చిత్రంతోనే చక్కటి విజయాన్ని సొంతంచేసుకున్న రష్మిక మందన్న అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. వెంకీ కుడుమల ద్వితీయ చిత్రం ‘భీష్మ’లో కూడా రష్మిక మందన్ననే నాయికగా నటించింది. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సక్సెస్ఫుల్ కాంబోలో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.
నితిన్తో రెండో చిత్రానికి రష్మిక మందన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ నెలాఖరులోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.