సినీ పరిశ్రమలోని నటీనటులతో పాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు టీఎఫ్సీసీ నంది సౌత్ అవార్డ్స్ అందజేస్తామని టీఎఫ్సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీఎఫ్సీసీ నంది సౌత్ ఇండియా అవార్డ్స్ 2020-22 వేడుకను వచ్చే ఉగాది రోజున నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు సినీ ప్రముఖులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరుకానున్నారు. ఈ అవార్డుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందజేయాలని ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశాం’ అన్నారు.