బిగ్ బాస్లో శనివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. ముందుగా నాగార్జున శుక్రవారం హౌజ్లో ఏం జరిగిందో చూపించాడు. జైలులో ఉన్న సన్నీ చాలా ఫ్రస్ట్రేషన్తో కనిపించాడు. సంచాలకుడు జెస్సీని మాత్రం సమర్ధిస్తే ఒప్పుకోను.. నాగ్ సార్ వచ్చి చెప్పినా సరే నేను రాంగ్ అనే చెప్తాను. నేను ఫిజికల్ అవ్వలేదు.. జెస్సీని కొట్టాలనే ఇన్టెన్షన్లో బ్యాగ్ని తన్నలేదని చెప్పాడు సన్నీ .
ఇక పూరీ టాస్క్ ఇంటి సభ్యులకి ఇచ్చి రెండు గ్రూపులుగా విడగొట్టారు బిగ్ బాస్. ఆనీ, శ్రీరామ్, లోబో, విశ్వ, రవి, శ్రీరామ్లు ఒక టీం కాగా.. జెస్సీ, కాజల్, ప్రియాంక, మానస్, సిరి రెండో టీంలో ఉన్నారు. సంచాలకుడిగా షణ్ముఖ్ ఉన్నారు. టాస్క్ లో ఎవరైతే 50 పూరీలు చేస్తే వారే విజేతలు అని బిగ్ బాస్ అన్నాడు.కాజల్ టీం సభ్యులు తొందరగా కంప్లీట్ చేశారు. అయితే పర్ఫెక్ట్ మేకింగ్ అంటూ ఆనీ మాస్టర్ టీంని విజేతగా ప్రకటించాడు షణ్ముఖ్.
ఇక అక్కడ అసలు గొడవ మొదలైంది. జైలులో ఉన్న సన్నీ.. రూల్ బుక్లో ఫాస్ట్గా చేసిన వాళ్లే విజేత అని చెప్పారు కదా.. సరిగ్గా చదువుకోవచ్చు కదా అని షణ్ముఖ్కి చెప్పాడు . ఒళ్లు మండిన అనీ మాస్టర్.. సన్నీపై ఉవ్వెత్తున లేచింది. వాళ్లు కష్టపడి చేస్తే మేం ఆడుకుంటూ చేశామా? అంటూ అతనిపై ఫైర్ అయింది.
ఈమెకు తెలుగు సరిగా అర్థం కాలేదు అనుకుంటా తెలుగు నేర్పీయండి అని సన్నీ అంటే.. నాకు తెలుగు వచ్చు.. తెలుగు ఇండస్ట్రీలోనే వర్క్ చేశా.. అని చెప్పింది. నార్త్ ఇండియాలో చపాతీ ఫేమస్ మాస్టర్ అని సన్నీ అంటే.. నార్త్ ఇండియానా?? నేను పుట్టింది తెలంగాణలో నేను ఇండియన్ అరిసింది. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని పాయింట్ని లేవనెత్తి ఫేమస్ అవ్వాలని అనుకోకండీ,నేను మాట్లాడిన దాన్ని ఎక్కడికో లింక్ చేస్తారేంటి? అంటూ సన్నీ కూడా ఫైర్ అయ్యాడు.