Cinema News | సూర్యతేజ ఏలే కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటిస్తున్నది. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘చేసావు ఏదో మాయ’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. ప్రేమలోని మధుర భావాలకు అద్దం పడుతూ సాగే రొమాంటిక్ గీతమిదని చిత్రబృందం తెలిపింది.
ఈ కథలో హీరో ఔత్సాహిక ఫిల్మ్మేకర్ పాత్రలో కనిపిస్తారని, ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ శాఖమూరి, సంగీతం: వివేక్సాగర్, కథ: సూర్యతేజ ఏలే, స్క్రీన్ప్లే: సూర్యతేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర, దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర.