Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ చివరివారం నుంచి ‘వీడీ12’ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట శ్రీలీల పేరు వినిపించిన విషయం తెలిసిందే. తర్వాత శ్రీలీల స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పక్కన పెడుతూ తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భొర్సే నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై భాగ్యశ్రీ భొర్సేతో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భాగ్యశ్రీ భొర్సే ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోవైపు ‘వీడీ12’లో ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక అయినట్లు టాక్. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.