ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు పలు వివాదాలలలో ఇరుక్కుంటున్నారు. ఆ మధ్య టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులని డ్రగ్స్ కేసు విషయంలో విచారించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలని విచారించారు. సంజనతో పాటు మరో హీరోయిన్ని అరెస్ట్ చేశారు కూడా.
ఇక ప్రస్తుతం బాలీవుడ్లో పోర్నోగ్రఫీ చర్చ మొదలైంది. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ముద్దాయిగా నిలవగా, ఆయన చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ప్రముఖ బంగ్లాదేశ్ నటి పోరి మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్.ఏ.బీ) అదుపులోకి తీసుకుంది.
జూన్ 8న బోట్ క్లబ్ లో తనపై అత్యాచారం చేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని పోరి మోనీ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపించిన పోలీసులు బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ నడుస్తుందని గుర్తించారు. హీరోయిన్ కు కూడా ఇందులో సంబంధాలున్నాయని..అందుకే ఈమెపై కొందరు దాడి చేసేందుకు చూస్తున్నారని పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.
ఢాకాలోని బనానీలో పోరిమోనీ నివాసంలో బుధవారం నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించగా, తనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలు కీలక ఆధారాలను సేకరించి ఆమెను ఎలైట్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.