Bandla Ganesh | ఇండస్ట్రీలో సినిమాలతో పాటు కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు బండ్ల గణేశ్. ఇప్పుడు కూడా మరో వివాదంలో చిక్కుకున్నాడు. నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఒక సమయంలో అగ్ర నిర్మాతగా కూడా ఎదిగాడు. ఎదిగే క్రమంలో ఎన్నో కాంట్రవర్సీలు ఆయన చుట్టూ అల్లుకున్నాయి కూడా. తాజాగా కూడా ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామవాసి అయిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ ఇచ్చిన కోటీ 25 లక్షల చెక్కు బౌన్స్ కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. దాంతో విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే కొన్ని సార్లు కోర్టు బండ్ల గణేశ్ను న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఆయన పట్టించుకోలేదు. దీంతో ఒంగోలు సెకండ్ AMM కోర్టు బండ్ల గణేశ్ను వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో వెంటనే ఆయన స్పందించాడు. సోమవారం కోర్టుకు హాజరయ్యాడు. బండ్ల గణేశ్ లాయర్లతో కలిసి వెళుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి ఆయన మాట్లాడటానికి సహకరించలేదు. గతంలో కూడా బండ్ల గణేశ్పై ఇలాంటి చీటింగ్ కేసులు వచ్చాయి. హీరో, నిర్మాత సచిన్ జోషి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా సమయంలో బండ్ల గణేశ్ తనను మోసం చేశాడంటూ ఆ మధ్య కోర్టుకు వెళ్లాడు. కొద్ది రోజుల ఆ విషయం సద్దుమణిగింది. ఇప్పుడు మరోసారి రూ. 1.25 కోట్ల చెక్ బౌన్స్ విషయంలో కోర్టుకు హాజరయ్యాడు బండ్ల గణేశ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Most watched film | రిలీజ్ రోజు ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే..!
R Narayana Murthy | నాని ‘తెలుగు అమీర్ఖాన్’..ఆర్ నారాయణమూర్తి కామెంట్స్ వైరల్
SS Rajamouli | నేనా పని చేస్తే సుకుమార్కు గుండెపోటు వస్తుంది: రాజమౌళి