Rudrangi | శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు,మమతా మోహన్దాస్, విమల రామన్ ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకుడు. జూలై 7న చిత్రం విడుదల కానుంది.
కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకు మంత్రివర్యులు హరీష్రావు, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ సామజిక పరిస్థితులను చూపిస్తూ రూపొందించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.