హోరా హోరీగా సాగుతున్న మా ఎన్నికలలో పోటీ చేసేందుకు చిన్న, పెద్ద స్టార్స్ అందరు పోలింగ్ బూత్కి చేరుకుంటున్నారు. ముందుగా పవన్ కళ్యాన్ పోలింగ్ బూత్కి హాజరు కాగా, ఆ తర్వాత రామ్ చరణ్, చిరంజీవి,బాలకృష్ణ, సాయి కుమార్,రాశీ, శివ బాలాజీ, వడ్డే నవీన్,వేణు తదితరులు హాజరయ్యారు. ఓటు వేసిన తర్వాత మాట్లాడిన బాలకృష్ణ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్ రాజ్, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే.
ఇద్దరు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ఎవరు గెలిచినా కూడా మాకు సంతోషమే.రెండు ప్యానల్స్ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్టు కనిపించారు. ఇరు ప్యానల్స్ లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశారు. షూటింగ్స్ లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. ‘మా’ అంతిమలక్ష్యం నటీనటుల సంక్షేమం.. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం అని బాలయ్య అన్నారు.