టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) తెరకెక్కించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files). 1990లలో జమ్మూకశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో రూపొందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సక్సెస్ ఫుల్ టాక్తో ప్రదర్శించబడుతుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్తో ప్రదర్శించడుతూ..రాధేశ్యామ్ లాంటి భారీ ప్రాజెక్టును వెనక్కి నెట్టేసింది.
ది కశ్మీర్ ఫైల్స్ ఎఫెక్ట్, మరోవైపు అంచనాలకు తగ్గట్టు కథ లేకపోవడంతో రాధేశ్యామ్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ది కశ్మీర్ ఫైల్స్ ఇపుడు మరో సినిమాపై కూడా పంజా విసురుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన తాజా చిత్రం బచ్చన్ పాండే (Bachan Panday). గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాధేశ్యామ్లాగే ఈ సినిమాపై కూడా ది కశ్మీర్ ఫైల్స్ ఎఫెక్ట్ పడ్డది.
యావరేజ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఓపెనింగ్ డేన రూ.13+ కోట్ల వసూళ్లు చేసిన బచ్చన్ పాండే వీకెండ్ వచ్చేసరికి అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మూవీ శని, ఆదివారాల్లో మరింత కలెక్ట్ చేయాల్సి ఉండగా, ఆ రెండు రోజుల్లో కూడా కేవలం ₹ 12 కోట్లు మాత్రమే రాబట్టింది.ఇక వచ్చే శుక్రవారం మరో క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ కూడా విడుదల కాబోతుంది.
ఈ శుక్రవారంలోపు కాస్త ఉపశమనం దొరికితే బచ్చన్ పాండే సుమారు రూ.60-70 కోట్లు రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ది కశ్మీర్ ఫైల్స్ క్రేజ్ నేపథ్యంలో పెరుగుతున్న ఒత్తిడి నుంచి బచ్చన్ పాండే కోలుకునే ఛాన్స్ తక్కువేనని అభిప్రాయపడుతున్నారు మూవీ లవర్స్.